పేదల బియ్యాన్ని దోచుకునే దొంగకు అండగా ఉంటున్న రాజకీయ, అధికార దొంగలు ఎవరు..?

అక్రమ మార్గాలలో, కొందరు డీలర్ల సహకారంతో పేదల బియ్యాన్ని దోచుకుంటున్న బియ్యం బకాసురుడు

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తనకు తాను గొప్ప చెప్పుకుంటూ అవినీతి మాఫియాకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామయ్య

రేపల్లె (రాధే సింధూరం ) రేపల్లె నియోజకవర్గం లో అక్రమ రేషన్ బియ్యం దందా పలు విధాలుగా పెట్టరేగిపోతున్న సంబంధిత అధికారులు, నాయకులు చూసి చూడనట్లు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రధాన పార్టీకి చెందిన రామయ్య తీరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తున్నా కొందరు అధికారుల,రాజకీయ నాయకుల ధన ఆశ రామయ్యకు మూడు పువ్వులు ఆరు కాయలగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు డీలర్ల సహకారంతో యదేచ్చగా అక్రమ రేషన్ బియ్యం పగలు రాత్రి తేడా లేకుండా శ్రీరాంపురం కనగాల వైపు వాహనాలు పరుగులు పెడుతున్న వైనం అధికారులకు కనబడటం లేదా..? పేదల ఆకలి తీర్చడం కోసం ఇచ్చే బియ్యాన్ని పనికిరాని బియ్యం గా ప్రచారం చేయించి దోపిడీకి తెర లేపుతున్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయా ఉండవా.. టన్నులుకొద్ది పేదల బియ్యాన్ని దోచుకుంటూ ప్రభుత్వానికి మచ్చ తెస్తున్న కేటుగాళ్లపై, వారికి అండదండలుగా ఉంటున్న నాయకులపై అధిష్టానం కఠిన వైఖరి అవలంబించి, మాఫియా ఆగడాలను కూకటి వేళ్ళతో పెగలించి పేదలు గుక్కడే మెతుకులు నోట్లోకి పోయే విధంగా చేయాలి. సదర మాఫియా ఆగడాలపై మాఫియాకు అండగా ఉంటున్న అధికారులు రాజకీయ నాయకుల పై మరొక ప్రత్యేక కథనం